జనసేన నిరసన చేయటంతో రోడ్డు మరమ్మత్తులు

చిత్తూర్ జిల్లా, పలమనేరు నియోజకవర్గం, పలమనేరు గుడియతం జాతీయ రహదారి పై పది రోజుల క్రితం రోడ్ గుంతలు పూడ్చాలని జనసెన పార్టీ జిల్లా కార్యదర్శి దిలీప్ పసుపులేటి ఆధ్వర్యం లో నిరసన కార్యక్రమం జరిగింది. జనసేన నిరసన తెలపడం వల్ల ప్రభుత్వం రోడ్ పనులు పూర్తి చేయడంతో, స్థానిక ప్రజలు జనసేన పార్టీ విజయం అని హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రూరల్ ఇంఛార్జి నాగరాజు, భరత్, అభిరం, తదితరులు పాల్గొన్నారు.