ఈ నెల 27న తూర్పుగోదావరి జిల్లాకు రానున్న శ్రీ నాదెండ్ల మనోహర్…!

పిఏసి ఛైర్మన్ మాన్యశ్రీ నాదెండ్ల మనోహర్ 27 నుంచి 30 వరకు జిల్లాలో పర్యటిస్తారు. 27 సాయంత్రం రాజమండ్రి రాక హోటల్ షెల్టాన్ లో బస. నాయకులను కార్యకర్తలను కలుస్తారు. 28 ఉదయం బయలు దేరి జగ్గంపేటలో ఇన్సూరెన్స్ చెక్ అందజేత. అనంతరం కాకినాడ గ్రామీణ నియోజకవర్గంలో పంతం నానాజి గారి ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో పాల్గొని, భోజనానంతరం మండపేట బయలు దేరి అక్కడ శ్రీ వేగుళ్ల లీలాకృష్ణ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో పాల్గొని రాత్రికి అమలాపురంలో బస. 29, 30 తేదీలలో అమలాపురం, పి. గన్నవరం, రాజోలు నియోజకవర్గాల నాయకులు జనసైనికులు, వీరమహిళలతో సమీక్ష మరియు శ్రీ శెట్టిబత్తుల రాజబాబు ఆధ్వర్యంలో పార్టీలో చేరికలు. 30 మద్యాహ్నం నుండి తిరుగు ప్రయాణం.