క్రియాశీలక సభ్యుడి కుటుంబానికి శ్రీ నాదెండ్ల మనోహర్ పరామర్శ

• రూ. 5 లక్షల చెక్కు అందచేత
అమలాపురం నియోజకవర్గం, కూనవరం గ్రామానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు శ్రీ కొప్పిశెట్టి రామస్వామి ఇటీవల ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా గురువారం పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ , జిల్లా నాయకులతో కలసి కూనవరంలోని రామస్వామి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ తరఫున శ్రీ పవన్ కళ్యాణ్ పంపిన రూ. 5 లక్షల బీమా చెక్కును అతని భార్య శ్రీమతి దుర్గకు అందచేశారు. ఆమెకు ధైర్యం చెప్పి, పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, పీఏసీ సభ్యులు పంతం నానాజీ, పితాని బాలకృష్ణ, అమలాపురం ఇంఛార్జ్ శెట్టిబత్తుల రాజబాబు, పార్టీ నాయకులు కళ్యాణం శివ శ్రీనివాస్, బండారు శ్రీనివాస్, తుమ్మల రామస్వామి, డీఎంఆర్ శేఖర్, ఆకుల బుజ్జి తదితరులు పాల్గొన్నారు.