30వ తేదీన భీమవరంలో శ్రీ పవన్ కళ్యాణ్ బహిరంగ సభ

జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ నెల 30వ తేదీన భీమవరంలో బహిరంగ సభ నిర్వహిస్తారు. ఆ రోజు సాయంత్రం 5 గం.కు భీమవరం అంబేడ్కర్ సెంటర్లో వారాహి నుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మంగళవారం సాయంత్రం భీమవరం శివార్లలోని కళ్యాణ మంటపంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నాయకుల సమావేశం నిర్వహించారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “భీమవరంలో నిర్వహించే సభ ఎంతో ప్రాముఖ్యమైనదిగా అందరూ భావించాలి. ఈ కార్యక్రమం అనంతరం వారాహి విజయ యాత్రకి స్వల్ప విరామం ఇస్తాం” అన్నారు. తిరిగి ప్రారంభించే యాత్ర రూట్ మ్యాప్ పై ఈ సమావేశంలో చర్చించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, జిల్లాకు చెందిన పిఏసీ సభ్యులు, నియోజకవర్గాల ఇంచార్జులు, ముఖ్య నాయకులూ పాల్గొన్నారు.