మదనపల్లిలో అంగన్వాడీలకు అండగా శ్రీ రామ రామాంజనేయులు

మదనపల్లి: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు.. గురువారం మధ్యాహ్నం మదనపల్లి నియోజకవర్గం స్థానిక మిషన్ కాంపౌండ్ పక్కన మాతా శిశు సంక్షేమ భవనం వద్ద గత 10 రోజులుగా నిరవదిక సమ్మె చేస్తున్న 500 మంది మదనపల్లి, రామ సముద్రం, నిమ్మనపల్లి అంగన్వాడీ టీచర్స్, వర్కర్స్ మరియు హెల్పర్స్ కు.. మదనపల్లి జనసేన పార్టీ నాయకులు శ్రీరామ రామాంజనేయులు ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి దారం అనిత అధ్యక్షతన మధ్యాహ్నం భోజనం ఏర్పాటు తదుపరి అంగన్వాడీలతో కలిసి జనసేన నాయకులు సహపంక్తి భోజనం చేస్తూ అంగన్వాడీల సాధకబాధకాలు తెలుసుకోవడమైనది.