కొణతాల రామకృష్ణను మర్యాదపూర్వంగా కలిసిన శృంగవరపుకోట జనసేన నాయకులు

శృంగవరపుకోట, ఉత్తరాంధ్ర సీనియర్ నాయకులు మాజీమంత్రి వర్యులు కొణతాల రామకృష్ణ ఇటీవల పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన సందర్భంగా శృంగవరపుకోట నియోజకవర్గ ఇన్చార్జ్ వబ్బిన సత్యనారాయణ మర్యాదపూర్వంగా కలిసి స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొణతాల రాకతో ఉత్తరాంధ్ర పార్టీ మరింత బలం పుంజుకుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రచార కమిటీ మెంబర్ మల్లువలస శ్రీను, యల్.కోట మండల నాయకులు షేక్ ఫిరోజ్, వేపాడ మండలం సీనియర్ నాయకులు రుద్ర నాయుడు పాల్గొన్నారు.