రైతులకు అండగా ఉంటాం: కిల్లో రాజన్

పాడేరు నియోజకవర్గం: గూడెం కొత్త వీది మండల పరిధిలోని, రాంపుల పంచాయితి బందవీది గ్రామానికి చెందిన రైతుల తాలూకా కాపీ తోటలు కాలిపోవడం బాధాకరం అని జనసేన పార్టీ రూరల్ జిల్లా జాయింట్ సెక్రెటరీ కిల్లో రాజన్ పేర్కొన్నారు. కిల్లో రాజన్ మాట్లాడుతూ.. సంబంధిత రైతులు పంట కళ్లముందు అగ్నికి ఆహుతి అవ్వడం చూసి బోరుమని విలపించారు. ప్రధాన జీవనోపాధి తోట కావడంతో జీర్ణించుకోలేక పోతున్నారు. అందుకు ప్రభుత్వం వారు సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి రైతులకు ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం, నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేలా మా వంతుగా కృషిచేస్తామని హామీ ఇస్తూ, అధికారుల దృష్టికి తీసుకు వెళతామని జనసేన పార్టీ జి.కే వీధి మండల నాయకులు తరపున బరోసా ఇచ్చారు.