ఆలమూరు గ్రామంలో పలువురిని పరామర్శించిన బండారు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ మంగళవారం ఆలమూరు మండలంలో ఆలమూరు గ్రామం నందు ఈ సందర్భంగా పలువురు ఆనారోగ్య కారణాల వల్ల విశ్రాంతి తీసుకుంటున్న పలువురుని పరామర్శించి ఉన్నారు. ఈ కార్యక్రమంలో మొదటిగా పరామర్శించిన వారిలో గత కొద్దిరోజుల క్రితం మోచేతికి ఫ్యాక్చర్ అయిన కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న కర్రి సత్యనారాయణను పరామర్శ చేసి, కర్రి సత్యనారాయణ రిటైర్డ్ ఏఎస్ఐ వారిని ఆలమూరు గ్రామం వెళ్ళి వారి ఇంటి యందు కలిసి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ గత కొద్దిరోజుల నుంచి కొంచెం రికవరీ అయిన ఆలమూరు గ్రామ జనసేన పార్టీ అధ్యక్షుడు రాజును పరామర్శించి, కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఆలమూరు గ్రామానికి చెందిన ద్విభాషం ప్రకాష్ ను, గత కొద్దిరోజుల క్రితం కొంత అనారోగ్యం చెందిన కారణంగా ఆపరేషన్ చేయించుకున్న ప్రకాష్ కలిసి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నేత బండారు శ్రీనివాస్ వెంట, ఆలమూరు మండల అధ్యక్షులు సూరప్ప రెడ్డి సత్య, కొత్తపల్లి నగేష్, సలాది జయప్రకాశ్ నారాయణ (జె పి) చల్లా బాబి, చల్లా వెంకటేశ్వరావు, సిరిగినీడి పట్టాభి, జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్ల డేవిడ్ రాజ్, వీర మహిళలు కొండేటి హేమ దేవి, కోట వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.