సీఎం జగన్‌కు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ రాశారు. ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్‌ను ప్రభుత్వం నిషేధించడం బీజేపీ సాధించిన విజయo అంటూ..ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్‌ వల్ల ప్రజల సొమ్ము దోపిడీకి గురవుతోందని, గుట్కాను నిషేధించినా కిరాణ, కిళ్లీ షాపుల్లో దొరుకుతోందన్నారు. గుట్కా అమ్మకాలు అరికట్టి ప్రజారోగ్యాన్ని కాపాడాలని సోము వీర్రాజు ఆ లేఖలో పేర్కొన్నారు.