విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టుకు అడుగులు

విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టుకు ముందడుగులు పడుతున్నాయి. లైట్‌ మెట్రో రైలు, మోడ్రన్‌ ట్రామ్‌ కారిడార్‌లకు సంబంధించిన డీపీఆర్ అర్బన్‌ మాస్‌ ట్రాన్సిస్ట్‌ కంపెనీ సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది చివరికల్లా లైట్‌ మెట్రో, మోడ్రన్‌ ట్రామ్‌ కారిడార్లకు డీపీఆర్‌లు పూర్తి అయితే.. వాటిని ప్రభుత్వం అధ్యయనం చేసిన వెంటనే బిడ్డింగ్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. పరిస్థితులన్నీ అనుకూలిస్తే మార్చి 2021 నాటికి పనులకు సంబంధించి అగ్రిమెంట్‌ పూర్తిచేసి.. 2021 జూన్‌ నాటికి లైట్‌ మెట్రో కారిడార్‌ పనులు ప్రారంభించి.. మార్చి 2024 నాటికి లైట్‌ మెట్రోలో ఒక కారిడార్‌ నుంచి మెట్రో రైలు పరుగులు తీస్తుందని అధికారులు భావిస్తున్నారు.