హయత్ నగర్ డిగ్రీ కళాశాలను సందర్శించిన జనసేన విద్యార్థి విభాగం

హైదరాబాద్: జనసేన విద్యార్థి విభాగం భలోపేతంలో భాగంగా బుధవారం హయత్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సందర్శించి నూతన విద్యార్థులకు స్వాగతం పలుకుతూ విద్యార్థుల సమస్యల గురించి ప్రతి క్లాసుకి వెళ్లి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జాయిన్ జనసేన విద్యార్థి విభాగం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. విద్యార్థులు ఉత్సాహంగా జనసేన విద్యార్థి విభాగంలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల జనసేన విద్యార్థి విభాగం కమిటీని ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన విద్యార్థి విభాగం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మహేష్ పెంటల, ఓయూ ప్రెసిడెంట్ వినోద్ నాయక్, విద్యార్థి నాయకులు సంపత్, జతిన్ తదితరులు పాల్గొన్నారు.