తెలంగాణా జనసైనికుడి బైక్ యాత్ర..

  • అమలాపురంలో ఆహ్వానం పలికిన జనసేన టీమ్

అమలాపురం: ఆంధ్రా ప్రజలకు మేలు చేసే ఒకే ఒక్క నాయకుడు పవన్ కళ్యాణ్ మాత్రమే అని, ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని తెలంగాణా వరంగల్ కు చెందిన జనసైనికుడు దీపక్ మోటారు సైకిల్ పై రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసుకుంటూ బుదవారం అమలాపురం చేరుకున్నారు. స్థానిక ఎర్ర వంతెన వద్ద 30 నిమిషాల పాటు ఉండి ప్లకార్డును ప్రజలకు చూపిస్తూ ప్రచారం చేశారు. అనంతరం స్థానిక జనసేన ప్రాంగణం వద్ద జనసేన నాయకులు దీపక్ ను సత్కరించి శుభాభినందనలు తెలిపారు. అమలాపురం నుండి కాకినాడ, వైజాగ్ మీదుగా శ్రీకాకుళం చేరుకుంటానని దీపక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ యాళ్ల సతీష్, కంచిపల్లి అబ్బులు, లింగోలు పండు, ఆర్.డి.యస్.ప్రసాద్, నాగ మానస, పడాల నానాజీ, వాకపల్లి వేంకటేశ్వరరావు, నందుల సత్తిబాబు, పోలిశెట్టి కన్నా, నిమ్మకాయల రాజేష్, అల్లాడ రవి, బండారు వెంకన్న బాబు, పరమట చిట్టిబాబు, నల్లా రామ్మూర్తి, తిక్కా సరస్వతి, కర్రి లక్ష్మి దుర్గ, కరాటం వాణి, వానపల్లి దేవి, నల్లా దుర్గారావు, పెదమల్లు మణికంఠ తదితరులు పాల్గొన్నారు.