జనం కోసం జనసేన మహాపాదయాత్ర

రాజానగరం, జనసేన-తెలుగుదేశం-బిజెపి పార్టీలు బలపరచిన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ కోరుకొండ మండలం బుచ్చింపేట గ్రామంలో జనం కోసం జనసేన మహాపాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా గ్రామంలో గల గణపతి ఆలయంలో స్వామి వారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రానున్న ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా జనసేన పార్టీ ఆశయాలు సిద్దాంతాలు ప్రజలకు చేరువచేస్తూ కోరుకొండ మండలం బుచ్చింపేట గ్రామంలో జనం కోసం జనసేన మహాపాదయాత్రలో భాగంగా ప్రతీ ఇంటికీ తిరుగుతూ ప్రతీ ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మన తరువాతి తరాల భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా మార్చుకోవడానికి ఒక్కసారి జనసేన పార్టీకి అవకాశం ఇచ్చి మన జనసేన-తెలుగుదేశం-బిజెపి పార్టీలు బలపరచిన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణని అఖండ మెజారిటీతో గెలిపించండి అని జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి, వీరమహిళా సాధికార కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి తోట ప్రత్యూషాదేవి, వందనాంబిక అభ్యర్థిస్తూ ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన-తెలుగుదేశం-బిజెపి పార్టీ నాయకులు, జనసైనికులు, కార్యకర్తలు, వీరమహిళలు, గ్రామ ప్రజలు భారీగా పాల్గొన్నారు.