వారాహి యాత్ర ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మార్పులకు శ్రీకారం..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నుండి చేపట్టనున్న వారాహి యాత్రను జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొల్లిశెట్టి సత్యనారాయణ ఆరుకు పార్లమెంట్ వంపూరు గంగులయ్య పిలుపుమేరకు అరకు నియోజవర్గ నాయకులు వారాహి యాత్రను జయప్రదం చేయటానికి పాల్గొంటున్నారు. జనసేన పార్టీ పెదబయలు మండల అధ్యక్షులు జాగరపు పవన్ కుమార్ వారాహీ యాత్ర పోస్టర్ ని ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కుమార్ మాట్లాడుతూ.. యువత, రైతులు, విద్యార్థులు మహిళలు వారహి యాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని తెలియజేశారు. ఈ వారాహి యాత్రతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో బలమైన మార్పులకు శ్రీకారం చుట్టు బోతున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జాగరపు పవన్ కుమార్, సురేష్, ఉమ్మడి జిల్లా కార్య నిర్వహణ కమిటీ సభ్యులు కోటేశ్వరరావు, పడాల్ బలిజ హుకుంపేట మండల నాయకులు దనేశ్వరారావు, జనసైనికులు డుమ్రిగూడ రమణమూర్తి, జనసైనికులు డుంబ్రిగూడ అలాగే అనంతగిరి మండల అధ్యక్షులు చిట్టం మురళి పాల్గొంటున్నారు.