నారాలోకేష్ కి సంఘీభావం తెలిపిన తంగెళ్ల, జ్యోతుల

పిఠాపురం నియోజకవర్గం: యువగళం పాదయాత్ర 4వ రోజు కార్యక్రమం ఉప్పాడ కొత్తపలి మండలం, శీలంవారిపాకల గ్రామం నుంచి శనివారం ఉదయం ప్రారంభించడం జరిగింది. ఈ యువగళం యాత్రకు జనసేన పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు, ఇతర జనసేన నాయకులు, జనసైనికులు సంఘీభావం తెలియజేశారు. ముందుగా నారా లోకేష్ తో కలిసి జనసేన ఇంచార్జ్ తంగెళ్ళ శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఎస్వీఎస్ వర్మ, జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు పాదయాత్రను చేసి తగు మద్దతుని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీనాయకులు, కార్యకర్తలు, మహిళ కార్యకర్తలు, జనసేనపార్టీ నాయకులు, జనసైనికులు, కార్యకర్తలు వీరమహిళలు భారీ స్థాయిలో పాల్గొన్నారు.