రాజోలులో జనసేన ఆధ్వర్యంలో నిరసన

రాజోలు: పన్నుల రూపంలో ప్రజలు కడుతున్న ప్రజా ఖజానా నుండి పింఛన్లు ఇస్తూ.. వాలంటీర్లు, వైసీపీ కన్వీనర్ లు వైసీపీకి ఓటు వేయకపోతే పింఛన్లు తీసివేస్తాం అంటూ బెదిరించడం జరుగుతుంది. ఈ విషయంపై జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలతో సఖినేటిపల్లి, మలికిపురం, రాజోలు మండలాల ఎంపీడివో కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు.