నాదెండ్లను మర్యాదపూర్వకంగా కలిసిన నిడదవోలు జనసేన నాయకులు

నిడదవోలు నియోజకవర్గ జనసేనపార్టీ బలోపేతం కోసం జనసేనపార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ని కలసి నియోజకవర్గ సమస్యలను, నిడదవోలు నియోజకవర్గంలో జరుగుతున్న జనసేన పార్టీ కార్యక్రమాల వివరాలను నిడదవోలు నియోజకవర్గ జనసేన నాయకులు పొలిరెడ్డి వెంకటరత్నం (పివిఆర్) వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి నిడదవోలు నియోజకవర్గంలో జనసేన జెండా ఎగురావేసే విధంగా పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.