కోటవురట్ల ఆధ్వర్యంలో టీం పిడికిలి పవన్ కళ్యాణ్ పోస్టర్ విడుదల

పాయకరావుపేట నియోజకవర్గం: కోటవురట్ల మండల జనసేన పార్టీ నాయకులు బాలేపల్లి ఏసుబాబు, ఉగ్గిన రాము ఆధ్వర్యంలో టీం పిడికిలి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోస్టర్ ను శుక్రవారం రిలీజ్ చేయడం జరిగింది. ప్రజలు సమాజ హితం కోసం పవన్ కళ్యాణ్ గారికి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ఎన్నాళ్ళు అక్రమ అవినీతి పాలన జరిపిన అధికార ప్రతిపక్షాలు తప్పుకునే టైం వచ్చిందని తెలిసే విధంగా ఈ ప్రస్తుత పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ సీఎం అయ్యేంతవరకు అలుపెరగని పోరాటం చేస్తామని అదేవిధంగా నిరంతరం పార్టీ శ్రేయస్సు కోసం పనిచేస్తున్న టీం పిడికిలి సభ్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా రానున్న రోజుల్లో గ్రామస్థాయిలో జనసేన పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి మరియు జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలను ఆశయాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే అంశంపై చర్చించడం జరిగింది. ఎన్ని దశాబ్దాలు గడిచిన అన్నదాతల ఆర్తనాదాలకు ముగింపు లేకపోవడం పై అసహనాన్ని వ్యక్తం చేస్తూ రైతుకు కావలసింది గిట్టుబాటు ధర కాదు లాభసాటి ధర అని తెలిసే విధంగా మరణించిన కౌలురైతులకు రైతు భరోసా యాత్ర చేయడం మరొక పోస్టర్ను రిలీజ్ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో కోటవురట్ల మండలానికి చెందిన జనసైనికులు మరియు వివిధ గ్రామాలచెందిన జనసైనికులు పాల్గొనడం జరిగింది. వాళ్లందరికీ జనసేన పార్టీ తరపున నా ప్రత్యేక ధన్యవాదాలు