Telangana: పెట్రోల్, డీజిల్ పై తెలంగాణా ప్రభుత్వం వ్యాట్ భారం తగ్గించాలి

కేంద్ర ప్రభుత్వం పెట్రోలుపై 5రూపాయలు డీజిలుపై 10రూపాయలు ఎక్సైజ్ డ్యూటి తగ్గించింది. దాదాపు 11రాష్ట్రాల ప్రభుత్వాలు రాష్ట్ర పరిధిలోని వ్యాట్ తగ్గించి ప్రజలపై పడే భారాన్ని తగ్గించే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. తెలంగాణా ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్ పై వేస్తున్న వ్యాట్ భారాన్ని తగ్గించి రాష్త్ర పౌరుల పై అదనపు భారాన్ని తగ్గించాలని, సామాన్యునికి అండగా నిలబడాలని తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వానికి జనసేనపార్టి తరపున విజ్ఞప్తి చేస్తున్నామని జనసేనపార్టీ తెలంగాణా రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ అన్నారు.