కౌలు రైతు భరోసా యాత్రలో భాగస్వామిని చేసినందుకు కృతజ్ఞతలు: బాల్యం రాజేష్

జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్ర ద్వారా ఆత్మహత్య చేసుకున్న పుల్లారెడ్డి అనే రైతు కుటుంబానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి నుంచి లక్ష రూపాయలు చెక్కును వారి కుటుంబానికి ఇప్పించడం జరిగింది. ఈ సందర్భంగా వచ్చిన డబ్బును పిల్లల చదువుకు ఉపయోగిస్తామని పుల్లారెడ్డి భార్య తెలియజేశారు. ఇలాంటి మంచి కార్యక్రమం లో నన్ను భాగస్వామ్యం చేసినందుకు పవన్ కళ్యాణ్ గారికి, జిల్లా అధ్యక్షులు వరుణ్ గారికి, పిఎసి సభ్యులు మధుసూదన్ రెడ్డి కి, జనసేన కార్య నిర్వాహక ప్రధాన కార్యదర్శి భవాని రవి కుమార్ కు అనంతపురం జిల్లా జనసేన జాయింట్ సెక్రెటరీ బాల్యం రాజేష్ కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.