వైసీపీని గద్దెదించడమే లక్ష్యం

  • జనసేన నాయకుడు మనుబోలు శ్రీనివాసరావు

తిరువూరు: గ్రామ గ్రామానికి జనసేన జెండా కార్యక్రమంలో భాగంగా తిరువూరు నియోజకవర్గంలో తిరువూరు మండలంలో పలు గ్రామాల్లో పర్యటించిన నియోజకవర్గ సమన్వయకర్త మనుబోలు శ్రీనివాసరావు మరియు తిరువూరు మండల అధ్యక్షుడు పర్సా పుల్లారావు వారిరువురు నియోజకవర్గ జనసేన నాయకులతో కలిసి శుక్రవారం రాత్రి మండలంలోని పెద్దవరం, ఎర్రమాడు గ్రామాలలో క్షేత్రస్థాయిలో పర్యటించి గ్రామాల్లోని పెద్దలను జనసైనికులు కలిసి రానున్న ఎన్నికల్లో పార్టీ బలోపేతం గురించి చర్చించారు. ఈ సందర్భంగా పూర్వ పిఆర్పి నేత కుమార్ ఎడ్యుకేషన్ సొసైటీ అధినేత అప్పికట్ల కుమార్ సైతం ఈ కార్యక్రమంలో పాల్గొని రెండు గ్రామాల్లో పలువురు నాయకులను కలవడం జరిగింది. నియోజకవర్గ సమన్వయకర్త మనుబోలు శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రస్తుత వైసిపి ప్రభుత్వానికి గద్దె దింపాలంటే జనసైనికులు, తెలుగుదేశం నాయకులు సమన్వయంతో పనిచేస్తూ ఓటు బదిలీ అయ్యేవిధంగా ప్రణాళికలు రచించుకోవాలని, ఇరు పార్టీల నాయకులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ఇదే సందర్భంలో పెద్దవరం గ్రామ మాజీ సర్పంచ్ గద్దె కృష్ణయ్య మరియు పలువురు నేతలను అలానే ఎర్రమాడు గ్రామంలో సీనియర్ జనసేన నాయకులు గ్రామ జనసేన పార్టీ అధ్యక్షుడు గోపిశెట్టి తులసి ప్రసాద్ మరియు గ్రామ జనసేనకులను కలిసి బూత్ కన్వీనర్లను ఏర్పాటు చేసుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడిగా తీసుకునే నిర్ణయానికి జనసైనికులు తెలుగుదేశం నాయకులు అందరూ కట్టుబడి ఉండాలని ఈ సందర్భంగా వారికి దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బత్తుల వెంకటేశ్వరరావు, ఉయ్యూరు జయప్రకాష్, 2024 సార్వత్రిక ఎన్నికల ఆంధ్రజోన్ కమిటీ సభ్యుడు పసుపులేటి నరేష్ మిత్ర(పండు), లింగినేని సుధాకర్, పసుపులేటి రవీంద్ర, వెల్ ఫిట్ సత్యనారాయణ తరుణ్, ఫిరోజ్, రాజేష్ తదితర జనసైనికులు పాల్గొన్నారు.