పవన్ కళ్యాణ్ ని సీఎం చేయడమే లక్ష్యంగా పనిచేయాలి: బాషా

సత్యవేడు నియోజకవర్గం: బి. ఎన్ కండ్రిగ మండలం, కాటూరు, పూసలపల్లి గ్రామాలలో జనసేన మండల అధ్యక్షుడు బాషా ఆధ్వర్యంలో జనసైనికులతో మరియు మహిళలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా కార్యదర్శి కొప్పల లావణ్యకుమార్ హాజరయ్యారు. ముందుగా కాటూరు గ్రామంలోని యువతతో మాట్లాడటం జరిగింది. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం చేసి రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేయడం జరిగింది. అనంతరం పూసలపల్లి గ్రామంలో మహిళలతో మాట్లాడం జరిగింది. వారిని పార్టీ లోకి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు భాస్కర్, గురవయ్య, మురళి, శ్రీను, తదితరులు పాల్గొనడం జరిగింది.