విశ్రాంత ప్రధానోపాధ్యాయుడి పెద్ద మనసు

* విరాళంగా జనసేన పార్టీకి ఒక నెల పెన్షన్
* సున్నితంగా తిరస్కరించిన శ్రీ పవన్ కళ్యాణ్

ఉమ్మడి చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం రామాపురానికి చెందిన విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ పి. వెంకట రమణ గారు శుక్రవారం జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మంగళగిరి కేంద్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి భావజాలానికి ఆకర్షితులైన శ్రీ వెంకట రమణ గారు తనకు వచ్చే ఒక నెల పింఛన్ సొమ్ము రూ.61,116 పార్టీకి విరాళంగా ఇచ్చేందుకు డి.డి.ని తీసుకొచ్చారు. ఆయన పెద్దమనసును అర్ధం చేసుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆ విరాళాన్ని సున్నితంగా తిరస్కరించారు. శ్రీ వెంకట రమణ గారితో సంభాషించి కుటుంబ వివరాలు, ఉద్యోగ విరమణ తరవాత జీవితం గురించీ తెలుసుకున్నారు. శ్రీ వెంకట రమణ గారు పట్టుబట్టడంతో రూ. 10 విరాళంగా తీసుకొని ఆయనను శ్రీ పవన్ కళ్యాణ్ గారు గుండెలకు హత్తుకున్నారు.