తెలంగాణకు ఢిల్లీ సర్కార్ రూ. 15 కోట్ల సాయం

భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన తెలంగాణ రాష్ట్రానికి అండగా నిలబడేందుకు ఇతర రాష్ట్రాలు ముందుకొస్తున్నాయి. నిన్న తమిళనాడు ప్రభుత్వం రూ.10 కోట్లు వరద సాయం చేస్తున్నట్టు ప్రకటించగా.. తాజాగా ఢిల్లీ ప్రభుత్వం కూడా ఆదుకునేందుకు సిద్ధమైంది.ఈ మేరకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

‘హైదరాబాద్‌ నగరాన్ని వరదలు ముంచెత్తాయి. ఈ సంక్షోభ సమయంలో హైదరాబాద్‌ వాసులకు దిల్లీ ప్రజలు అండగా ఉంటారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతోన్న సహాయక చర్యల్లో భాగంగా దిల్లీ ప్రభుత్వం తరపున రూ.15కోట్లను అందిస్తాం’ అని కేజ్రీవాల్‌ ట్విటర్‌లో వెల్లడించారు.