జనంలోకి జనసేన సిద్దాంతాలు

గుంటూరు, చుట్టుగుంట ప్రాంతము, ఏటి. అగ్రహారంలో 24వ వార్డు కొన్ని కుటుంబాలని కలసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మనోగతం అనే పుస్తకంలో ఉన్న అమూల్యమైన విషయాలను కొన్ని కుటుంబాలకి తెలియజేసి వారు మరో పది మందిని ఉత్తేజ పరిచే విధంగా వివరించడం జరిగింది. మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి తన కార్యకర్తలని, తన ఎమ్మెల్యేలను ఇంటింటికి పంపించి ఒకే ఒక్క ఛాన్స్ అని ముద్దులు పెట్టుకుంటూ రోడ్డు మీద తిరిగి రాష్ట్రాన్ని అప్పులు ప్రాంతంగా సర్వనాశనం చేశారు. ఇవన్నీ ప్రజల్లో ప్రభుత్వ పనితీరు బాలేదు అని చెప్పి జనసైనికులు ఇంటింటికి తిరుగుతూ వివరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తలు లక్ష్మీశెట్టి సాయిచంద్ (నానీ), చందు శ్రీనివాసరావు, డి.భార్గవ్ రామ్, పసుపులేటి నరసింహారావు, తాడికొండ శ్రీనివాసరావు, డి.రాము, ఆళ్ల కాసులు, రాము, రాకేష్, సుభాష్, దుర్గా ప్రసాద్, వెంకట గోపి, లక్ష్మి నారాయణ, సోమిశెట్టి వెంకటేష్, ఋషి, నికిత్, ప్రేమ్ చంద్ మరియు తదితర జనసైనికులు పాల్గొన్నారు.