సానబోయిన వీరభద్రరావుని సత్కరించిన పితాని

ముమ్మిడివరం, జనసేన పార్టీ 2024 ఎన్నికల కార్యక్రమాల నిర్వహణకు గోదావరి జోన్ కమిటీలో ముమ్మిడివరం నియోజకవర్గం నుండి గేదెల్లంక గ్రామానికి చెందిన జనసేన పార్టీ సీనియర్ నాయకులు సానబోయిన వీరభద్రరావుని రాష్ట్ర జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ అభినందించి, సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జక్కంశెట్టి బాలకృష్ణ (పండు), దూడల స్వామి, పితాని రాజు, వంగా సీతారాం, గాలిదేవర రాము, గుత్తుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.