అగ్నిప్రమాద బాధితులను ఆదుకున్న గుడివాడ పట్టణ జనసైనికులు

గుడివాడ నియోజకవర్గం, గుడివాడ మండల న్యూజెల్ల గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల షేక్ మస్తాన్ ఇల్లు పూర్తిగా కాలిపోవడంతో వారిని పరామర్శించి వారికి బియ్యం నిత్యావసర సరుకులు అందజేసి గుడివాడ పట్టణ జనసైనికులు మానవత్వాన్ని చాటుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు డాక్టర్ మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అనే నినాదంతో ఆంధ్రుల అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ ఆశీస్సులతో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో మేము చేస్తున్న సేవా కార్యక్రమాలు భాగంగా ఈరోజు గుడివాడ మండల న్యూజెల్ల గ్రామంలో అగ్నిప్రమాద బాధితులను పరామర్శించి వారికి మా వంతు సహాయంగా బియ్యం నిత్యావసర సరుకులు మరియు ఆర్థిక సహాయం అందించి వారికి మేము ఉన్నామని భరోసా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గుడివాడ పట్నంలో అనేక సేవా సంస్థలు వారు ఉన్నారని వారు కూడా స్పందించి ఆదుకోవాలని తెలియజేశారు. ఇప్పటివరకు ప్రభుత్వ అధికారులు మరియు అధికారపక్ష నాయకులు సహాయం చేయకపోవడం చాలా దారుణం అని ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చేసినప్పుడే ఆ మానవత్వం నిలుస్తుందని తెలియజేశారు.