ఇచ్చిన ప్రతి మాట పూర్తి చేస్తా: దల్లి గోవిందరెడ్డి

గాజువాక నియోజకవర్గం 64 వ వార్డు పర్యటనలో భాగంగా శనివారం 64 వ జనసేన కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి యారాడ గ్రామంలో సీసీరోడ్ లు, కాలవలు మరియు వాటర్ పైపులకి అధికారులను తీసుకువెళ్లి, ప్రజా సమస్యలు తెలుసుకొని స్థానిక కార్పొరేటర్ గా ప్రతి పనిని దగ్గరుండి ఎస్టిమేషన్ వేయించి తొందరలోనే పనులన్నీ ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. యారాడ గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని మాట ఇచ్చిన ప్రతి మాట పూర్తి చేస్తానని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ లక్ష్మి చౌదరి యారాడ గ్రామంలో వెనకబడిన మహిళ మహిళలు ఆర్థికంగా నిలబడేందుకు స్వయం ఉపాధి కోర్సుల్లో జనసేన పార్టీ తరఫున తన సొంత నిధులతో ఉపాధి కోర్సులు నేర్పించడానికి సిద్ధంగా ఉన్నానని స్థానిక మహిళలకు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళ మాక శాలిని, జనసేన పార్టీ మాజీ అధికార ప్రతినిధి చోడిపిల్లి ముసలయ్య, రెడ్డి సన్యాసిరావు, నగేష్, బంక సాయి, ముసలయ్య, అలాగే జీవీఎంసీ అధికారులు మరియు యారాడ గ్రామ పెద్దలు, జనసైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.