విద్యుత్ ఛార్జీలు పెంపు దారుణం

  • సామాన్యుల నడ్డి విరుస్తున్నారు
  • కాకినాడ కలెక్టరేట్ వద్ద జనసేన నిరసన
  • మండపేట ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ

మండపేట, వైస్సార్సీపీ ప్రభుత్వం అక్రమంగా విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారని మండపేట నియోజకవర్గ ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అదేశాలు మేరకు విద్యుత్ ఛార్జీలు అక్రమంగా పెంచినందుకు రేపు ఉదయం 9గంటలకు కాకినాడ కలెక్టర్ ఆఫీసు వద్ద జనసేనపార్టీ పిఏసి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ తో కలిసి నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్ కి వినతి పత్రం అందిస్తామని చెప్పారు. కావున జిల్లాలోని పిఏసి సభ్యులు, ఇంచార్జ్ లు, రాష్ట్ర జిల్లా కార్యవర్గ సభ్యులు, ప్రాంతీయ మహిళా విభాగం కన్వీనర్లు, అనుబంధ సంస్ధల సభ్యులు, జనసైనికులు, వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.