Tokyo Olympics: క్వార్టర్స్‌కు భారత పురుషుల హాకీ జట్టు.. జపాన్‌పై విజయం!

టోక్యో ఒలింపిక్స్ లో భారత పురుషుల హాకీ జట్టు జోరు కొనసాగుతోంది. ఇవాళ గ్రూప్ దశ చివరి లీగ్ మ్యాచ్ లో భారత హాకీ జట్టు అద్భుత విజయం సాధించింది. గోల్స్ వర్షం కురిసిన ఈ మ్యాచ్ లో భారత్ 5-3తో జపాన్ ను ఓడించింది. భారత్ గ్రూప్-ఏలో మొత్తం 4 విజయాలు సాధించింది. నిన్న అర్జెంటీనాపై 3-1తో నెగ్గిన భారత్, అదే ఊపును ఇవాళ జపాన్ పైనా ప్రదర్శించింది. కాగా, గ్రూప్-ఏలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా, భారత్ రెండో స్థానంలో నిలిచింది. గ్రూప్ దశలో భారత హాకీ జట్టు ఆసీస్ చేతిలో ఘోరపరాభవం చవిచూడడం తెలిసిందే.