రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను జనసేన అంబులెన్స్ లో హాస్పిటల్ కి తరలింపు

రాజానగరం: గురువారం రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో నడిచే ఉచిత అంబులెన్స్ సర్వీసులు ప్రచారం నిమిత్తం సీతానగరం మండలంలో తిరుగుతుండగా అదే సమీపంలో సీతానగరం మండలం, పురుషోత్తమపట్నం నుంచి వస్తున్న ప్రయాణికుల ఆటో సింగవరం గ్రామ శివారులో ఒక్కసారిగా కోతి అడ్డు రావడంతో ఆటో ఏటుగట్టు కిందకు దూసుకుపోయింది. ప్రమాదవశాత్తు ఆటోలో ప్రయాణించే ప్రయాణికులకు తీవ్రగాయాలు కావడంతో ఈ విషయం తెలుసుకున్న జనసైనికులు స్థానిక జనసేన నాయకుల సహకారంతో క్షతగాత్రులను జనసేన అంబులెన్స్ లో రాజమహేంద్రవరం ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు.