సురక్షితమైన ఆర్టీసీ ప్రయాణాన్ని సామాన్య ప్రజలకు దూరం చేస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వం

  • యం.ధనుంజయ జనసేన అధ్యక్షులు పామిడి మండలం.

ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీలను పెంచుకుంటూ పోతుంది ఈ వైసీపీ ప్రభుత్వం సామాన్య ప్రజలు ప్రయాణాలు చేయాలంటే చార్జీలకు భయపడి ప్రయాణాలను వాయిదా వేసుకునే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు తమ గమ్యస్థానానికి చేరాలి అనే ఆత్రుతతో ఆర్టీసీ బస్సులో చార్జీల మోత భరించలేక ఆటోలలో సామర్థ్యానికి మించి ప్రయాణిస్తుడటం వల్ల ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి, ప్రమాదాలలో కొందరు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ఇంకొందరు జీవితాంతం జీవచ్ఛవంలా బ్రతుకుతున్నారు, కాబట్టి సామాన్య ప్రజలను, పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ చార్జీలను ప్రభుత్వం వెంటనే తగ్గించ వలసిందిగా జనసేన పార్టీ డిమాండ్ చేస్తోంది.