కూకట్ పల్లిలో జనసేన జెండా ఎగరాలి

• ప్రేమ్ కుమార్ ను అఖండ మెజార్టీతో గెలిపిద్దాం
• ఆయన విజయానికి జన సైనికులు, వీర మహిళలు కృషి చేయాలి
• విలేకర్ల సమావేశంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

కూకట్ పల్లి నియోజకవర్గం జనసేన అభ్యర్ధి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ గెలుపు కోసం ప్రతి ఒక్క జనసైనికుడు, వీర మహిళ కృషి చేయాలని, భారీ మెజార్టీతో తెలంగాణ శాసనసభకు పంపించాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం సాయంత్రం కూకట్ పల్లి జనసేన పార్టీ కార్యాలయానికి విచ్చేసిన శ్రీ మనోహర్ గారు జనసేన ఎన్నికల ప్రచార సరళి, అనుసరించాల్సిన విధానాలపై పార్టీ బాధ్యులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను కవర్ చేసేలా ప్రచారం చేయాలని సూచించారు. అనంతరం విలేకర్ల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “కూకట్ పల్లి నియోజకవర్గంలో ఉన్న 407 పోలింగ్ బూత్ లకు బాధ్యుల నియామక ప్రక్రియ పూర్తయ్యింది. 24వ తేదీన నియోజకవర్గ పరిధిలోని జనసేన, బీజేపీ ప్రతినిధుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాల్గొంటారు. 26వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారితో కలిసి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూకట్ పల్లిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభను జన సైనికులు, వీర మహిళలతోపాటు బీజేపీ కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాల”ని కోరారు. విలేకర్ల సమావేశంలో కూకట్ పల్లి జనసేన పార్టీ అభ్యర్ధి శ్రీ ప్రేమ కుమార్ తోపాటు జనసేన పార్టీ నాయకులు శ్రీ బి.మహేందర్ రెడ్డి, శ్రీ రాధారం రాజలింగం, శ్రీ మల్లినీడి బాబీ, శ్రీ షేక్ రియాజ్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *