కొన్ని వేల కుటుంబాల దాహర్తీని తీర్చిన జనసేన పార్టీ

రాజోలు: గత 666 రోజులుగా రాజోలు నియోజకవర్గ జనసేన పార్టీ ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా నేటీకీ 2222 ట్యాంకర్ల త్రాగునీటిని ఉచితంగా అందించి కొన్ని వేల కుటుంబాలకు దాహర్తీని తీర్చిన జనసేన పార్టీ. దాతలు లేని జనసేనపార్టీ చిరుపవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్ వ్యవస్థాపకులు నామన నాగభూషణం సోంతఖర్చులతో ట్రాక్టర్ డీజల్ మరియు డ్రైవర్ జీతం ధనసహయంతో జనసేనపార్టీ చిరుపవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా మంగళవారం సఖీనేటిపల్లి స్టీమర్ రేవు మరియు పల్లిపాలేం ప్రాంతం ప్రజలు త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న వారికీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగింది.