వాలీబాల్ ఫైనల్స్ విజేతలకు జనసేన బహుమతి ప్రధానం

ఒంగోలు, పెర్నమిట్టలోని శాంతి నగర్లో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు కందుకూరి బాబు ఆధ్వర్యంలో 41, 42 వ డివిజన్ అధ్యక్షులు పెర్నమిట్ట శ్రీనివాస్, చల్ల శ్రీనివాస్ అధ్యక్షతన వాలీబాల్ పోటీల ఫైనల్స్ ఘనంగా జరిగాయి. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెదపూడి విజయ్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు కందుకూరి బాబు, రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ, ఒంగోలు నగర జనసేన పార్టీ అధ్యక్షులు మలగా రమేష్, చీమకుర్తి పట్టణ అధ్యక్షులు బండి ప్రసాద్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు చనపతి రాంబాబు, ముత్యాల కళ్యాణ్, రాయని రమేష్, ఒంగోలు నగర ప్రధాన కార్యదర్శులు కందుకూరి వాసు, పల్ల ప్రమీల, ఒంగోలు నగర కార్యదర్శులు ఇంకొల్లు శ్రీమన్నారాయణ, కోమలి, ఒంగోలు నగర సంయుక్త కార్యదర్శి ఉషారాణి మరియు స్థానిక సామాజిక వేత్త మేడికొండ జార్జ్ తదితరులు పాల్గొన్నారు.