మహాశివరాత్రి జాగరణ మహోత్సవంలో పాల్గొన్న బత్తుల

రాజానగరం మండలం ఆర్యవైశ్య అధ్యక్షులు, రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ ఉపాధ్యక్షులు ఆర్టిఎన్ మండవిల్లి వెంకటేశ్వరరావు, శ్రీమతి కాశీ అన్నపూర్ణ దంపతుల ప్రత్యేక ఆహ్వానం మేరకు రాజానగరం నియోజకవర్గ జనసేన-తెలుగుదేశం పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ మహా శివరాత్రి జాగరణ మహోత్సవంలో విశిష్ట అతిథిగా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజానగరం గ్రామ ప్రజలు, రాజానగరం మండల ఆర్యవైశ్య సంఘం, రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ మరియు రాజానగరం పరిసర గ్రామ అయ్యప్ప భక్తులు, భవాని భక్తులు, శివ భక్తులు జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులు తదితరులు పాల్గొన్నారు.