ఎన్నికలప్పుడు కూడా ఇదే ఉత్సాహం కొనసాగించాలి

* గల్ఫ్ దేశాల ఎన్.అర్.ఐ. జన సైనికులు, వీర మహిళల ఆత్మీయ సమావేశంలో నాగబాబు
గత మూడు రోజుల పాటు దుబాయ్ దేశంలో జనసేన ఆత్మీయ వేడుకలు నిర్వహించిన ఎన్.అర్.ఐ. జన సైనికులు, వీర మహిళలు ఎన్నికల సమయంలో కూడా ఇదే ఉత్సాహం కొనసాగించాలని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు గారు స్పష్టం చేశారు. గల్ఫ్ దేశాల్లో స్థిరపడిన ఎన్.అర్.ఐ. జన సైనికులు, వీర మహిళల ఆత్మీయ సమావేశం దుబాయ్ దేశం అజ్మాన్ నగరంలోని మైత్రీ ఫాంలో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు గారు ఎన్.అర్.ఐ. జన సైనికులను, వీర మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. గల్ఫ్ ఎన్.అర్.ఐ. జన సైనికులు, వీర మహిళలు గత మూడు రోజుల పాటు కుటుంబ సభ్యులుగా ఆతిథ్యం ఇచ్చిన విధానం చాలా సంతృప్తిగా ఉన్నదని, అవకాశం వస్టే మరొక్క సారి గల్ఫ్ దేశాలు పర్యటిస్తానని అన్నారు. ఆస్ట్రేలియా ఎన్.అర్.ఐ. జనసైనికులు, వీర మహిళల సమన్వయకర్త శ్రీ కొలికొండ శశిధర్ ఎన్.అర్.ఐ. కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.
* అంగరంగ వైభవంగా ముగిసిన ఆత్మీయ వేడుకలు
గల్ఫ్ ఎన్.అర్.ఐ. జనసైనికులు, వీరమహిళల ఆత్మీయ వేడుకలు దుబాయిలో అంగరంగ వైభవంగా జరిగాయి. జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు గారు ముఖ్యఅతిథిగా హాజరైన వేడుకల్లో సౌదీ అరేబియా, కువైట్, ఒమన్, ఖతార్, బహ్రెయిన్, యూఏఈ దేశాల నుండి వందలాది మంది జనసైనికులు, వీరమహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో జన సైనికులు, వీర మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. సౌదీ అరేబియా, కువైట్, ఒమన్, ఖతార్, బహ్రెయిన్, యూఏఈ దేశాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో, శ్రీ కేసరి త్రిమూర్తులు, శ్రీ చందక రామదాసు, శ్రీ కంచన శ్రీకాంత్ నేతృత్వంలోని స్థానిక కమిటీ సభ్యుల పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో రాంచంద్ర నాయక్, భాస్కర్ రావ్, జీ.కే. దొర, డా. హరికృష్ణ, కొండేపూడి సారంగ, కృష్ణా, భోసన్, రాయుడు వెంకటేశ్వర్లు, శింగురి రవికుమార్, వీర ప్రసాద్, ఉదయ్ కిరణ్, అంజన్ కుమార్, శ్రీకాంత్, రాజేష్, నగేష్, మూర్తి, వీరబాబు, శ్రీదర్, రవివర్మ, నారాయణ, భరత్, చంద్రశేఖర్, రునీల్, మైత్రి రవికుమార్, నాగభూషణ్, శ్రీదర్, వీర మహిళలు సునీత కొమరవులు, మంజుల మోగల్ల, లక్ష్మీ రజిత కేసరి, కొడిమండ్ల లక్ష్మీ, షీలా నీలగిరి, వాసవి బొబ్బిలి తదితరులు పాల్గొన్నారు.