సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఘటనపై స్పందించిన పవన్ కళ్యాణ్..

శుక్రవారం ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకున్న ఘటనలు దురదృష్టకరమైనవని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు. అగ్నిపథ్ పథకం ద్వారా ఆర్మీ రిక్రూట్మెంట్ విధానంపై చేపట్టిన ఈ నిరసనల నేపథ్యంలో జరిగిన ఈ సంఘటనలు ఆవేదన కలిగించాయి. పోలీసు కాల్పుల్లో మృతి చెందిన యువకుడి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకొనేలా మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.