పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఇప్పటం గ్రామస్తులు

మంగళగిరి, ముఖ్య అతిథిగా జనసేన చేనేత వికాస విభాగం చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. తమ గ్రామంలో జనసేన ఆవిర్భావ సభ ద్వారా తమ గ్రామానికి జాతీయ స్థాయిలో గుర్తంపు తెచ్చినందుకు, జనసేన ట్రస్ట్ ద్వారా 50 లక్షల రూపాయలు తమ గ్రామానికి విరాళంగా ఇచ్చినందుకు కృతజ్ఞతగా పవన్ కళ్యాణ్ చిత్ర పటానికి పాలాభిషేకం చేసారు. కమిటీగా ఏర్పడి ఈ నిధులను గ్రామం లోని అభివృద్ధి పనులకు కేటాయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తాడేపల్లి మండల అధ్యక్షుడు మరియు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు, వీరమహిళలు మరియు గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.