జోగికి – తుపాకి రాముడుకి తేడా లేదు: ఎస్.వి.బాబు

  • కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్లుంది జోగి రమేష్ వాలకం

పెడన, తాడేపల్లి ప్యాలెస్ తాభెదారైన జోగి రమేష్ ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ మీద పసలేని ఆరోపణ చేశారు. జోగి రమేష్ కి దమ్ము ధైర్యం ఉంటే నియోజకవర్గ సమస్యలపై, తాను చేసిన అవినీతిపై బహిరంగ చర్చకు రావాలి. మట్టి దొంగ అయిన నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే హక్కు లేదు. జోగి రమేష్ కి సిగ్గు ఉంటే ఈ కింది ప్రశ్నలకు సమాధానం చెప్పాలి

• మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారం రోజులొ సిపిఎస్ రద్దు చేస్తానని మాట ఇచ్చారు. ఎందుకు రద్దు చేయలేదు?
• దశలవారుగా మద్యపాన నిషేధం చేస్తానన్నారు. ఎందుకు చేయలేదు?
• మీ యజమాని అమ్మ, విజయమ్మ మీ పార్టీ గౌరవ అధ్యక్ష పదవికి ఎందుకు రాజీనామా చేసింది సమాధానం చెప్పగలరా?
• జగనన్న వదిలిన బాణం షర్మిల పక్క రాష్ట్రానికి వెళ్లి ఎందుకు పార్టీ పెట్టింది. మీ దగ్గర సమాధానం ఉందా?
• వచ్చే ఎన్నికల్లో పెడన నుండే నేను పోటీ చేస్తానని చెప్పగలవా?
• కోడి కత్తి కేసు ఎక్కడ వరకు వచ్చింది. వివరించగలవా?
• బాబాయి గొడ్డలి పోటు సిబిఐ దర్యాప్తు ఏమయ్యింది. నీ దగ్గర సమాధానం ఉందా?
• అక్క చెల్లెమ్మలకు 30 లచ్చల ఇల్లు కేటాయించామని డబ్బా కొడుతుంటారు కదా. నీ పదవీకాలంలో ఎన్ని ఇల్లు కట్టగలవొ చెప్పగలవా?
• కాపు కార్పొరేషన్ కి సంవత్సరానికి 2000 కోట్లు ఇస్తానన్నారు. ఇప్పటివరకు ఎన్ని నిధులు కేటాయించారు శ్వేత పత్రం విడుదల చేసే దమ్ము మీకుందా?
• ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మీ ప్రభుత్వం వచ్చాక ఏమి ఓరగా పెట్టారో బహిరంగ చర్చకు సిద్ధమా?

పై ప్రశ్నలకు సమాధానం చెప్పి, అప్పుడు అడుగు జనసేన పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందో. నీ కన్నా ముందు ఇలాగే తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన బీహారోడి స్క్రిప్టులు చదివి, చదివి చతికిలపడి ఇప్పుడు ఇంట్లో కూర్చుని చెక్కభజన చేస్తున్నారు. భవిష్యత్తులో నీ పరిస్థితి అదే జోగి అని పెడన జనసేన నాయకులు ఎస్ వి బాబు అన్నారు.