తోట నానాజీ కుటుంబానికి మనోధైర్యాన్నిచ్చిన తిమ్మాపురం జనసేన

పాయకరావుపేట, ఇటీవల తిమ్మాపురం గ్రామానికి చెందిన తోట నానాజీ అనారోగ్యం కారణంగా స్వర్గస్తులైనారు, వారి కుటుంబానికి శానాపతి బాబురావు మాష్టారు ఆధ్వర్యంలో జనసేన చేయూత కార్యక్రమం ద్వారా రూపాయలు 25,000/- ఆర్థిక సహాయంతో పాటు 50 కేజీల బియ్యం తిమ్మాపురం జనసేన పార్టీ అధ్యక్షుడు ప్రసాదుల గణేష్ చేతుల మీదుగా అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వంగలపూడి నానాజీ, పేరెడ్డి శ్రీనివాస్, శ్రీ విద్యా శ్రీనివాస్, గుర్రం ధన, పిల్లి నాగేష్, యర్రా మాధవ, శానాపతి లోవరాజు, శానాపతి రామ్ కుమార్, టేకు చందు, పవన్, శానాపతి శ్రీను పాల్గొన్నారు.