జనసేన పార్టీ లో చేరిన తిమ్మాపురం సీనియర్ నాయకులు
తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ రూరల్ నియోజకవర్గం ఇన్ ఛార్జ్, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు పంతం నానాజీ ఆధ్వర్యంలో, రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో, జనసేన పార్టీ కార్యాలయం నందు తిమ్మాపురం గ్రామ సీనియర్ రాజకీయ నాయకులు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వం పై విశ్వాసంతో.. పంతం నానాజీ వైఖరి నచ్చి జనసేనను బలపరచాలనే ఉద్దేశ్యం తో పార్టీ లో చేరుతున్నట్టు వారు తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా జనసేనపార్టీని అధికారం లోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తాం అని వారు తెలిపారు. పార్టీ లో చేరిన వారిలో మాదారపు తాతాజీ, మాజీ జెడ్.టి.సి, ఎం.పి.టి.సి, సర్పంచులు మరియు సోషల్ యాక్టివిస్ట్ రాజేశ్వరి తదితరులు ఉన్నారు. అందరికీ పార్టీ కండువాలు వేసి పి.ఏ.సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.