విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చేస్తే వేల సంఖ్యలో కార్మికుల బతుకులు రోడ్డున పడతాయి: భైరా నాగరాజు

రాజోలు, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాజోలు నియోజకవర్గంలో సఖినేటిపల్లి మండలం అంతర్వేది దేవస్థానం చెందిన జనసేన ఎంపిటిసి భైరా నాగరాజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ప్లకార్డులతో పార్లమెంటు సమావేశాలు జరిగే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల ఓట్లతో గెలిచిన వైఎస్సార్సీపీ & టిడిపి పార్లమెంటు సబ్యులు తప్పనిసరిగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని శాంతియుతంగా నిరసన తెలియజేయాలని కోరారు. లేని పక్షమున మీకు ఓట్లేసిన ప్రజలకు మీ క్షమాపణలు చెప్పి ఎంపీ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు అలాగే ఒకవేళ అలాచేయని పక్షంలో విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు చీకటి ఒప్పందం చేసుకున్నారు అనే సంకేతాలు ప్రజల్లోకి బలంగా వెళతాయని ఆయన అన్నారు.