మరో బలిదానం జరగక ముందే వైసీపీ ఎంపీలు కళ్ళు తెరవండి: దార్ల కుమారి లక్ష్మి

రాజోలు, జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపుతో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదిస్తూ ప్లకార్డులతో రాజోలు గాంధీ బొమ్మ కూడలినందు రాజోలు జనసేన మహిళా ఎంపీటీసీ శ్రీమతి దార్ల కుమారి లక్ష్మి నిరసన తెలియచేశారు. రాజోలు మెయిన్ రోడ్డులో ప్రజలకు విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై అవగాహన కలిగిస్తూ డిజిటల్ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం గతంలో సుమారు 32 మంది విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం బలిదానాలు చేశారు అది మళ్లీ పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఎంపీలు అందరిది బాధ్యత అని ఆమె అన్నారు. ప్రజల ఓట్లతో గెలిచి ప్రజల కోసం పార్లమెంటులో విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ గురించి ప్రస్తావించకపోవడం ఏమిటి అని వైసీపీ, టిడిపి ఎంపీలను ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి దార్ల కుమారి లక్ష్మి మరియు తోరం చిన్ని పాల్గొన్నారు.