ఎమ్మెల్యే పేరు చెప్పి సామాన్యులకు బెదిరింపులు

శ్రీకాళహస్తి మున్సిపాలిటీ పరిధిలోని ఊరందురు ఆర్చి దగ్గర వున్న ఇల్లు మరియు కాళీ స్థలాన్ని ఎమ్మెల్యే మనుషులు అని వచ్చి బెదిరిస్తున్నారు. మా ఇల్లు మరియు స్థలానికి జేసీబీ చదును చేస్తాము అని కొంతమంది మనుషులు వచ్చి బెదిరిస్తున్నారు. 2021 జూన్ నెలలో ఎమ్మెల్యే బియ్యపు మధు సుధన్ రెడ్డి గారి మనుషులు అని చెప్పి అరఖాడ్ ముత్తు, కంచి. గురవయ్య, సుబ్రహ్మణ్యం వచ్చి బెదిరించి అగ్రిమెంట్ రాయించారు. గవర్నమెంట్ రేట్ 5000 రూపాయలు స్క్వేర్. ఫీట్ ని 1000 రూపాయలకు రాయించుకున్నారు. అగ్రిమెంట్ గడువు ముగియగా వాళ్ల మనుషులని పంపించి ఆడవారి మీద దౌర్జన్యం చేస్తున్నారు. వారు కోర్ట్ ద్వారా నోటీసు పంపించారు. దానికి బదులు సమాధానంగా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తున్నాము అని కోర్ట్ ద్వారా నోటీసులు పంపాము. అయినా వచ్చి దౌర్జనం చేస్తున్నారు. అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుంటు కోర్ట్ ద్వారా నోటీసు కూడా పంపించాము. అగ్రిమెంట్ రాసుకున్న సిద్ధప్ప రెడ్డి మునిశేఖర్ రెడ్డి ఎవరో కూడా మాకు తెలియదు. అతని పేరు చెప్పి ఇక్కడ వున్న వైస్సార్సీపీ నాయకులు బెదిరిస్తున్నారు. సర్వే నెంబర్ -193/1 డేగ. గుణభూషణమ్మ మరియు వారి కూతుర్లకు సంబంధించిన ఆస్తి పానగల్, శ్రీకాళహస్తి మున్సిపాలిటీ కి సంబంధించిన ఆస్థిని కబ్జా చేయడానికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు. మధుసూదన్ రెడ్డి మనుషులు అర్హడ్ ముత్తు, కంచి గురవయ్య, సుబ్రమణయం మరియు వాళ్ల మనుషులు వచ్చి ల్యాండ్ కబ్జా చేస్తాముని బెదిరిస్తున్నారు.