మోహన్ బాబును బెదిరించిన దుండగులు!

గుర్తుతెలియని దుండగులు మోహన్ బాబు ఇంటికి వెళ్లి బెదిరించినట్లు ఒక వార్త వైరల్ అయ్యింది. దుండుగులు కారుతో పాటు వేగంగా కాంపౌండ్ వద్దకు దూసుకొచ్చి మోహన్ బాబు నీ అంతు చూస్తాం అని బెదిరించినట్లు ఈ సంఘటనపై స్వయంగా మోహన్ బాబు కుటుంబమే పహాడిషరీఫ్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది.

మోహన్ బాబు కుటుంబo శంషాబాద్ పరిసర ప్రాంతాల దగ్గర  పొలాల మధ్య ప్రశాంతంగా నిర్మించుకున్న విశాలమైన ఇంట్లో నివసిస్తోంది. ఈరోజు కొందరు అగంతకులు సడెన్ గా ఆయన కాంపౌండ్లో చొరబడి బెదిరించినట్లు తెలుస్తోంది. వారు సాయుధులై వచ్చారన్న అనుమానంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారని చెబుతున్నారు. అయితే దుండుగులు ఎంత వేగంగా వచ్చారో అంతే వేగంగా అరిచి బెదిరిస్తూ వెళ్లిపోయారని సమాచారం.

సీసీ కెమెరాల ఆధారంగా కారు వివరాలతో పహడీషరీఫ్ పోలీసులకు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. దుండుగులు ఏపీ 31 ఏఎస్ 0004నెంబర్ కారులో మోహన్ బాబు ఇంటికి వచ్చినట్టు మోహన్ బాబు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొనగా . ఈ పని ఎవరు చేసి ఉంటారు? దీనికి కారణం ఏమిటి? అని పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపగా.

మోహన్ బాబు ఇంటి సీసీ టీవీ కెమెరాల్లో రికార్డ్ అయిన కారు నంబర్ ఆధారంగా పోలీసులు విచారణ జరిపి ఆ దుండగులను అరెస్ట్ చేశారు.

ఈ నలుగురు నిందితులు మైలార్ దేవ్ పల్లి దుర్గానగర్ కు చెందిన వాళ్లని పోలీసులు గుర్తించారు. వీళ్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు వీళ్ల కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. వీళ్లు కావాలని చేశారా? లేక ఎవరైనా పంపించారా? అన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.