నేడు గ్రేటర్ లో ట్రాఫిక్ ఆంక్షలు

గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు ఎల్‌బీ స్టేడియంలో జరగనున్న టీఆర్‌ఎస్‌ బహిరంగ సభకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభకు హాజరు కానున్న నేపథ్యంలో మధ్యాహ్నం 3గంటల నుంచి రాత్రి 8గంటల వరకు స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శనివారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు స్టేడియం పరిసరాల్లో వాహనాలకు అనుమతి ఉండదు. ఆయా ప్రాంతాలలో తిరిగే వాహనాలను మళ్లించి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తరలిస్తారు.