ఏపీలో నివర్ తుఫాను బీభత్సం.. లక్షల ఎకరాల్లో పంట నీటిపాలు..
నివర్ తుఫాను ఏపీలో బీభత్సం సృష్టించింది. ఎడతెరపి లేని వర్షాలతో పలు జిల్లాలను ముంచెత్తింది. లక్షల ఎకరాల్లో పంటను నీటిపాలు చేసింది. వేలాది మందిని నిరాశ్రయులుగా మార్చింది. భారీ వరదలు ఎంతో మంది తమ సర్వశ్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. ప్రధానంగా చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలపై నివర్ తుఫాన్ తీవ్ర ప్రభావం చూపింది.