పవన్ కళ్యాణ్ సేవా ట్రస్ట్ నాయకులకు సన్మానం

తూర్పుగోదావరి, మదర్ థెరిస్సా వృద్ధుల ఆశ్రమం ఇమ్మిడివరప్పాడులో 18 సంవత్సరాలు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అమలాపురం పట్టణంలో క్రీస్తు సంఘం పెద్దలు విక్టర్ సారథ్యంలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమలాపురం మండలం చిందాడ గురువు జనసేన పార్టీ ఎంపిటిసి మోటూరి కనకదుర్గ, పవన్ కళ్యాణ్ సేవా ట్రస్ట్ అధ్యక్షులు, జనసేన నేత మోటూరి వెంకటేశ్వర రావును సన్మానించారు. ఎక్కడ ఆకలి కేకలు వినిపించినా మేము ఉన్నామని ఆకలి తీర్చే ఆదర్శ దంపతులు ఇద్దరిని ఘనంగా సన్మానించారు. అలాగే వృద్ధుల ఆశ్రమానికి కూడా మీరు అండగా ఉంటూ మరి ఇంకా ఎన్నో సేవలు చేయాలని వక్తలు, పాస్టర్ విక్టర్ అన్నారు. అతిధులు ప్రముఖ న్యాయవాది ముషిని రామకృష్ణ, లాయర్ ఎన్. నాయుడు తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో క్రీస్తు సంఘం పెద్దలు పట్టణ ప్రముఖులు మరియు యువకులు మహిళలు హాజరయ్యారు.