లాలుపురం జనసేన కార్యాలయంలో పొట్టి శ్రీరాములుకు ఘన నివాళి

గుంటూరు జిల్లా, ప్రత్తిపాడు నియోజకవర్గం, లాలుపురం గ్రామంలోని జనసేన పార్టీ కార్యాలయంలో అమరజీవి స్వర్గీయ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరత్తయ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశభాషల సమున్నతకి ఆత్మబలిదానం గావించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని, అలానే 58 రోజులు ఆమరణ నిరాహారదీక్ష చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధించడంలో పొట్టి శ్రీరాములు కీలక పాత్ర పోషించారని జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరత్తయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరత్తయ్య, కార్యాలయం ఇన్చార్జి కాటూరి శ్రీనివాసరావు (మాష్టారు) గుంటూరు రూరల్ మండల ప్రధాన కార్యదర్శి అక్కి రవికుమార్, లాలుపురం జనసేన పార్టీ గ్రామ ప్రధాన కార్యదర్శి శీలం శ్రీహరి, గ్రామ కార్యదర్శి ఆదూరి శివప్రసాద్ మరియు జనసైనికులు సూదాబత్తుల శివయ్య, సజ్జలు రవికుమార్, ప్రతివాడ వీరయ్య, విష్ణుమెలకల రాంబాబు (ఆటో), శృంగారం భాస్కరరావు, తన్నీరు రాము తదితరులు పాల్గొన్నారు.